అలప్పుజ, అక్టోబర్ 11: పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల సమస్యను ఎదుర్కొనటంపై కేరళ వ్యవసాయ మంత్రి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడవి పందుల మాంసాన్ని తినేందుకు ప్రజలకు అనుమతిస్తే చాలు, ఈ సమస్యను మరింత సమర్థంగా ఎదుర్కొనవచ్చునని అన్నా రు. అడవి పందులేమీ అంతరించిపోతున్న జాతి కాదని, వాటిని చంపి తినొచ్చునని అభిప్రాయపడ్డారు. శనివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అడవి పంది మాంసం తినడానికి ప్రస్తుతం కేంద్ర చట్టాలు అనుమతించటం లేదని చెప్పారు. అడవి పంది మాంసం తినడానికి ప్రజల్ని అనుమతించాలి. వాటితో ఎదురవుతున్న సమ స్య పరిష్కారమవుతుంది’ అని అన్నా రు. కేరళ ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని సవరించిన కొద్ది రోజుల్లోనే ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.