అహ్మదాబాద్, మే 23: ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లకు సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్లకు గుజరాత్లోని అహ్మదాబాద్ కోర్టు తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. జూన్ 7న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.
మోదీ అకడమిక్ డిగ్రీలకు సంబంధించిన వివాదంలో కేజ్రీవాల్, సంజయ్ సింగ్లు వ్యంగ్య, నిందాపూర్వక వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ గుజరాత్ యూనివర్సిటీ క్రిమినల్ పరువునష్టం కేసు వేసింది.