న్యూఢిల్లీ : పంజాబ్ డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా అరెస్ట్తో విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఆప్, కాంగ్రెస్ మధ్య విభేదాలు నెలకొనడంతో ఈ వ్యవహారంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఏ నాయకుడికీ వ్యతిరేకం కాదని, తాము డ్రగ్ మహమ్మారికే వ్యతిరేకమని, ఈ ప్రచారంలో అన్ని పార్టీలూ కలిసిరావాలని కేజ్రీవాల్ పిలుపు ఇచ్చారు.
పంజాబ్లోని పటియాలాలో సోమవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్ స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బడా వ్యక్తి మూడు రోజుల కిందట అరెస్టయ్యారని, ఈ పార్టీలన్నీ సీఎం భగవంత్ మాన్ను నిందిస్తున్నాయని, ఈ పార్టీలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయని ప్రశ్నించారు.
తమ పోరాటం ఏ ఒక్క పార్టీపైనో, నాయకుడిపైనో కాదని, డ్రగ్ మహమ్మారిపైనే తాము పోరాడుతున్నామని, డ్రగ్ కల్చర్ మన యువత భవిష్యత్ను పాడుచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పార్టీలో ఎవరైనా డ్రగ్స్ దందా చేసే వారుంటే వారిని వెంటనే మీ పార్టీల నుంచి తొలగించండని కేజ్రీవాల్ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
Read More :