Kejriwal | పంజాబ్లో ఇంతటి బలహీన ప్రభుత్వాన్ని తానెన్నడూ చూడలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్లో కుమ్ములాటలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజల గురించి పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. పంజాబ్ పరిస్థితి మళ్లీ దిగజారిపోతోందని, పంజాబ్ను నిండా ముంచేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రజలను పట్టించుకునేవాడే లేడని, ఆమ్ఆద్మీ ఒక్కటే ప్రజలను కాపాడుతుందని ఆయన భరోసా కల్పించారు. శుక్రవారం సీఎం కేజ్రీవాల్ పాటియాలా ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. తాజాగా స్వర్ణ మందిరంలో జరిగిన ఘటన వెనుక ఎవరున్నారు? వారి నేపథ్యం… ఇలాంటి వేటిపైనా స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించలేదని ఆయన విమర్శించారు. 48 గంటల్లోనే తేల్చేస్తామని బీరాలు పలికిన సర్కార్ ఇప్పుడేం సమాధానం చెబుతుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు.