కేదార్నాథ్: కేదార్నాథ్ పవిత్రతను సంరక్షించేందుకు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించినట్టు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. ఆలయం లోపలికి ఫోన్లు తీసుకురావడం, ఫొటోలు తీయడం, వీడియోలు, రీల్స్ రికార్డ్ చేయడంపై నిషేధం విధించారు.
గుడిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడానికి, యాత్రికులకు సజావుగా దర్శనం కలుగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యుడు వినీత్ పొస్తి తెలిపారు.