జమ్ము-కశ్మీర్ ;సందర్శకులకు కనువిందు చేసే కశ్మీర్లోని ఆసియాలోనే అతి పెద్దదైన ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్ను ప్రజల సందర్శనార్థం ఆదివారం తెరిచారు. రంగురంగుల, వివిధ రకాలతో నిండిన అరుదైన తులిప్ పుష్పాల తోటను జమ్ము-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఈ ఏడాది ఈ తోటలో 68 రకాల తులిప్ పుష్పాలు అందుబాటులోకి వచ్చినట్టు చెప్పారు. గత ఏడాది ఈ తులిప్ తోటను 3.60 లక్షల మంది సందర్శించారని, ఈ ఏడాది ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. జమ్ము రీజియన్లోని సన్సరా ప్రాంతంలో ఈ ఏడాది ఏప్రిల్లో మరో తులిప్ తోటను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు చెప్పారు.