శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. హిందువులే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. రెండు రోజుల ఓ ఉపాధ్యాయురాలుపై కాల్పులకు తెగబడ్డ ముష్కరులు.. గురువారం ఓ బ్యాంకు అధికారిని కాల్చి చంపారు. గత మే నెలలో ఏడుగురు కశ్మీర్ పండిట్లు సహా ఇద్దరు హిందూ ఉద్యోగులను ఉగ్రవాదులు పొట్టనపెట్టున్నారు. గత కొద్ది రోజులుగా వరుసగా జరుగుతున్న ఘటనలతో కశ్మీర్ నుంచి జమ్మూ వరకు తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత మంగళవారం ఉపాధ్యాయురాలు రజనీ బాలా (36), ఆమె భర్త రాజ్కుమార్ ఇద్దరూ మూడేళ్లుగా కుల్గామ్ జిల్లాలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
రజనీని గోపాల్పొరా ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నది. ఎప్పటిలాగే పాఠశాలకు ఆమె చేరుకున్నారు. పాఠశాల ఆవరణలోకి వెళ్తున్న క్రమంలో అక్కడికి వచ్చి కాల్పులు జరిపారు. రక్తపు మడుగులు కొట్టుమిట్టాడుతున్న ఆమెను పాఠశాల సిబ్బంది, స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తాజాగా రాజస్థాన్కు చెందిన విజయ్కుమార్ అనే వ్యక్తి కుల్గామ్లోని ఓ బ్యాంకులో మేనేజర్గా పని చేస్తుండగా.. బ్యాంకులో చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్కుమార్తో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతలు ఖండించారు.
మే 7 | శ్రీనగర్లోని డాక్టర్ అలీజాన్ రోడ్లోని ఐవా బ్రిడ్జి సమీపంలో ఉగ్రవాదుల దాడిలో పోలీస్ కానిస్టేబుల్ గులాం హసన్ దార్ ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందారు.
మే 12 | బుద్గామ్లోని చదూరా తహసీల్ కార్యాలయంలో కశ్మీరి పండిట్ రాహుల్ భట్ పని చేస్తున్నారు. ఉగ్రవాదులు కార్యాలయంలోకి చొరబడి కాల్పులు జరుపడంతో భట్ ప్రాణాలు కోల్పోయారు.
మే 13 | పుల్వామా గదూరా గ్రామంలో పోలీస్ రియాజ్ అహ్మద్ను ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడి చంపారు.
మే 17 | బారాముల్లాలోని మద్యం దుకాణంపై గ్రెనేడ్ దాడి చేయడంతో సేల్స్మెన్ రంజిత్ సింగ్ మృతి చెందాడు. ఇదే ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు.
మే 25 | బుద్గామ్లో టీవీ నటి అమ్రిన్ భట్ను ఉగ్రవాదులు ఇంటి వద్దనే కాల్చిచంపారు. ఆమె పది సంవత్సరాల మేనల్లుడికి చేతికి బుల్లెట్ గాయాలయ్యాయి.
మే 24 | శ్రీనగర్లో పోలీస్ సైఫుల్లా ఖాద్రీని హత్య చేశారు. ఇదే ఘటనలో ఆయన ఏడు సంవత్సరాల కుమార్తె గాయపడింది.
మే 31 | కుల్గామ్లోని గోపాల్పొరాలో హిందూ మహిళా ఉపాధ్యాయురాలు రజనీ బాలాను హత్య చేశారు.
జూన్ 2 | కుల్గామ్ జిల్లాలో ఓ బ్యాంకులో మేనేజర్గా పని చేస్తున్న రాజస్థాన్కు చెందిన విజయ్కుమార్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.