జ్ఞాన్వాపీ కేసు ఓవైపు కొనసాగుతుండగానే.. కర్ణాటకలో ఓ హిందూత్వ సంస్థ అలాంటి వివాదాన్నే లేవనెత్తింది. శ్రీరంగపట్న పట్టణంలోని మసీదు స్థానంలో అంతకుముందు హనుమాన్ ఆలయం ఉండేదని, ఆ ప్రాంతంలో పూజలకు అనుమతించాలని ‘నరేంద్ర మోదీ విచార్ మంచ్’ అనే రైట్వింగ్ గ్రూప్ మాండ్య జిల్లా అధికారులను కోరింది.
ఈ మేరకు మంచ్ రాష్ట్ర కార్యదర్శి సీటీ మంజునాథ్ నేతృత్వంలోని బృందం మాండ్య జిల్లా డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చింది. బెంగళూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీరంగపట్నలో టిప్పు సుల్తాన్ హయాంలో జామియా మసీదు నిర్మించారు.