బెంగళూరు: బయటకు వినిపించేలా మొబైల్లో వీడియోలు, సాంగ్స్ ప్లే చేస్తే బస్సు నుంచి దించేస్తారు. హైకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) ఈ నిర్ణయం తీసుకున్నది. బస్సులో అందరికీ వినిపించేలా, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా అధిక సౌండ్తో మొబైల్లో సాంగ్స్, వీడియోలు ప్లే చేయడంపై నిషేధం విధించింది. బస్సు లోపల ‘శబ్దం అంతరాయం’పై ఆంక్షలు విధించాలని కొరుతూ ఒక పిటిషనర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మొబైల్లో అధిక సౌండ్తో పాటలు, వీడియోలను ప్లే చేయడాన్ని పరిమితం చేయాలని కోరారు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు దీనిపై చర్యలు చేపట్టాలని కేఎస్ఆర్టీసీని ఆదేశించింది. అధిక వాల్యూమ్తో పాటలు, వీడియోలను ప్లే చేయవద్దని, సహ ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవద్దని బస్సు ప్రయాణికులకు సూచించాలని పేర్కొంది. సూచనలు పాటించని ప్రయాణికులను అధికారులు బస్సు నుంచి దించేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.