బెంగళూరు: కర్ణాటక బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నియమితులయ్యారు. (Yediyurappa’s son Vijayendra) ప్రస్తుత అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్రను తక్షణమే రాష్ట్ర ఇన్ఛార్జ్గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా నియమించినట్లు అపాయింట్మెంట్ లేఖలో పేర్కొన్నారు. శివమొగ్గలోని షికారిపుర నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవి కోసం సీటీ రవి, సునీల్కుమార్, బసనగౌడ పాటిల్ యత్నాల్తో పాటు విజయేంద్ర కూడా పోటీపడ్డారు.
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవడంపై ఆ పార్టీ ప్రధానంగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలోని జేడీ(ఎస్)తో బీజేపీ పొత్తుపెట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తున్నది.