బెంగళూరు: కర్ణాటక అటవీ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ విశ్వనాథ కత్తి కన్నుమూశారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. 61 ఏండ్ల ఉమేశ్ అర్ధరాత్రి వేళ తన స్వగృహంలో పడిపోయారు. దీంతో ఆయనను చికిత్స కోసం దవాఖానకు తరలించారు. అప్పటికే మంత్రి మరణించారని వైద్యులు నిర్ధారించారు. ఉమేశ్ మృతిపట్ల సీఎం బస్వరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సేవాభావం, సమర్థత, అంకితభావం ఉన్న మంత్రి అని, ఆయన లేని లోటు తీర్చలేనిదని ట్వీట్ చేశారు. అనంతరం మంత్రి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
ಅರಣ್ಯ ಸಚಿವ, ನನ್ನ ಆಪ್ತ ಸಹೋದ್ಯೋಗಿ ಶ್ರೀ ಉಮೇಶ್ ಕತ್ತಿ ಅವರ ಅಕಾಲಿಕ ನಿಧನದಿಂದ ತೀವ್ರ ದುಃಖಿತನಾಗಿದ್ದೇನೆ. ಅವರ ನಿಧನದಿಂದ ರಾಜ್ಯ ಓರ್ವ ನುರಿತ ಮುತ್ಸದ್ಧಿ,ಕ್ರಿಯಾಶೀಲ ಮುಖಂಡ ಹಾಗೂ ನಿಷ್ಠಾವಂತ ಜನಸೇವಕನನ್ನು ಕಳೆದುಕೊಂಡಿದೆ. ಅವರ ಅಗಲಿಕೆಯ ದುಃಖವನ್ನು ಸಹಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ಆ ಭಗವಂತ ಅವರ ಕುಟುಂಬಕ್ಕೆ ನೀಡಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ pic.twitter.com/tcfNlw9Cdr
— Basavaraj S Bommai (@BSBommai) September 6, 2022
బెళగావి జిల్లా హెక్కేరి నుంచి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు. 1985లో జనతాదళ్ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా విజయంగా సాధించారు. అనంతరం జేడీయూ, జేడీఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో కాంగ్రెస్ టికెట్పై పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 2008లో బీజేపీలో చేరారు. ఆయన ఆ ఏ సదానందగౌడ, యడియూరప్ప, బస్వరాజ్ బొమ్మై మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు.