కర్ణాటక మంత్రి సుధాకర్
బెంగళూరు: ఆధునిక భారతీయ మహిళ అవివాహితగా ఉండాలని కోరుకుంటున్నట్టు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత డాక్టర్ కే సుధాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ, పెండ్లి జరిగినప్పటికీ పిల్లల్ని కనడానికి వాళ్లు అంతగా ఆసక్తి చూపించట్లేదని అన్నారు. సరోగసి విధానం ద్వారా సంతానోత్పత్తికి మొగ్గు చూపుతున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంతోమంది జంటలు.. వృద్ధులైన తల్లిదండ్రులను దూరం పెడుతున్నట్టు తెలిపారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే దీనికి కారణమని వెల్లడించారు. ఈ విధానం ఎంతమాత్రం సరైనదికాదని అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రపంచ మానసిక ఆరోగ్యదినం సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.