ఆ ప్రాంతం మాది అని ఒక రాష్ట్రం.. కాదు మాదేనని ఇంకో రాష్ట్రం.. అక్కడికి వచ్చి తీరుతామని ఒక రాష్ట్ర మంత్రుల వ్యాఖ్యలు.. రాకుండా నిషేధిస్తామని ఇంకో రాష్ట్ర సీఎం హెచ్చరికలు.. ఇదీ! కర్ణాటక-మహారాష్ట్ర మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదం. ఇదొక్కటే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల మధ్య ఇలాంటి వివాదాలే నడుస్తున్నాయి. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. ఆయా రాష్ర్టాల్లో పాలనలో ఉన్నది బీజేపీయే. కానీ, వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నాలేవీ లేవు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలపై కన్నెత్తి చూడటం లేదు. భారతదేశం వసుదైక కుటుంబం అని ప్రకటించే ప్రధాని మోదీ కూడా మౌనంగా ఉండటం గమనార్హం.
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ల నుంచే కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దు వివాదం నడుస్తున్నది. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. అసలేమిటీ వివాదం అంటే.. బెళగావి సహా నాలుగు జిల్లాల్లోని 865 పట్టణాలు/గ్రామాలు తమవంటే తమవని రెండు రాష్ర్టాలు గొడవ పెట్టుకోవటమే. సమస్యఎక్కడ పుట్టిందంటే.. 1947లో స్వాతంత్య్రం వచ్చే సమయానికి బెళగావి జిల్లా బొంబాయి ప్రెసిడెన్సీలో ఉండేది. అయితే, 1956లో బెళగావి, బీజాపూర్, ధార్వాడ్, ఉత్తర కెనరా జిల్లాలను భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ మైసూరులో కలిపారు. అప్పటి నుంచి ఆ జిల్లాలు తమవేనని మహారాష్ట్ర వాదిస్తున్నది. ఈ అంశంపై మహారాష్ట్ర సుప్రీంను కూడా ఆశ్రయించింది. దీంతో 1966లో సుప్రీం సూచన మేరకు జస్టిస్ మెహర్చంద్ మహాజన్ సారథ్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ సమర్పించిన నివేదిక కర్ణాటకకు అనుకూలంగా ఉన్నది. దీన్ని 2004లో మహారాష్ట్ర మరోసారి సవాల్ చేసింది. ఈ కేసులో 18 ఏండ్ల తర్వాత తుది విచారణ వచ్చే వారం ప్రారంభం కానున్నది.
మహారాష్ట్ర మంత్రులు వస్తే చర్యలు: బొమ్మై
సరిహద్దు వివాదం కేసు సుప్రీం కోర్టులో ఉన్నందున మహారాష్ట్ర మంత్రులు బెళగావిని సందర్శించటం సరికాదని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అన్నారు. ఇదే విషయాన్ని మహారాష్ట్ర సర్కారుకు చెప్పామని, కాదని వస్తే నిషేధిస్తామని స్పష్టం చేశారు. సరిహద్దు వివాదంపై బెళగావిలోని మహారాష్ట్ర అనుకూల కార్యకర్తలను కలిసేందుకు మహారాష్ట్ర మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్ వస్తామని ప్రకటించారు. వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తే ఆందోళన తప్పదని కర్ణాటక అనుకూల కార్యకర్తలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బొమ్మై స్పందించారు. గత ప్రభుత్వాలు అవలంబించిన విధానాన్నే తామూ అవలంబిస్తామని పేర్కొన్నారు. ఆ మంత్రులు వచ్చి ఉద్రిక్తతలను సృష్టించాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పలు రాష్ర్టాల మధ్య ఇదే పరిస్థితి
అస్సాం-మేఘాలయ, అస్సాం- మిజోరం, అస్సాం- అరుణాచల్ప్రదేశ్, అస్సాం-నాగాలాండ్, ఉత్తరాఖండ్-ఉత్తరప్రదేశ్, పంజాబ్-హర్యానా రాష్ర్టాల మధ్య కూడా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. మొన్నకిమొన్న మేఘాలయకు చెందిన ఆరుగురిని అస్సాం పోలీసులు కాల్చి చంపారు. అటు.. 2021 జూలైలో మిజోరం పోలీసులు ఐదుగురు అస్సాం పోలీసులను కాల్చేశారు. అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్తోనూ అస్సాం సరిహద్దు వివాదాన్ని ఎదుర్కొంటున్నది. అయినా, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ వివాదాలను పరిష్కరించేందుకు ముందడుగు వేయకపోవటంతో పరిస్థితులు అదుపుతప్పే స్థాయికి చేరుకొంటున్నాయి.
ప్రధాని మోదీ మౌనం
సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశాన్ని ఏకం చేశారని, ఆయన అడుగు జాడల్లోనే తాము నడుస్తున్నామని ప్రధాని మోదీ పదేపదే చెప్తుంటారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే చెప్పారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించామని వెల్లడించారు. అయితే, అంతర్రాష్ట్ర సరిహద్దుల సమస్యలపై ఎందుకు ప్రధాని కిమ్మనకుండా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వివాదాలను పరిష్కరించటానికి ఎందుకు చొరవ చూపటం లేదని అడుగుతున్నారు. సరిహద్దు కోసం రెండు రాష్ర్టాల పోలీసులు గొడవ పెట్టుకోవటం, నీళ్ల కోసం కొట్లాడటం దేశానికి మంచివి కావని, అయినా, ప్రధాని మోదీ మౌనంగా ఉండటం దేనికి సంకేతమని నిలదీస్తున్నారు. ఇలాంటి గొడవలతో వసుదైక కుటుంబం అనేది ఎలా సాధ్యం? అని అంటున్నారు.
బీజేపీయేతర రాష్ర్టాలతో కేంద్రం కయ్యం
సరిహద్దు వివాదాలు ఒక ఎత్తైతే, బీజేపీయేతర రాష్ర్టాలతో కేంద్రం కయ్యం మ రో ఎత్తు. రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో గవర్నర్ల జోక్యం ఈ వివాదానికి కారణమైం ది. కేంద్రంలోని మోదీ సర్కారే గవర్నర్ల ను రాష్ట్ర ప్రభుత్వాలపైకి ఉసిగొల్పుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ర్టా ల ప్రభుత్వాలపై గవర్నర్లు చేస్తున్న వ్యాఖ్య లే ఈ ఆరోపణలకు ఆజ్యం పోస్తున్నాయి.
ముదురుతున్న వివాదం
సుప్రీం కోర్టులో సరిహద్దు సమస్య ఉన్నా, కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బెళగావి జిల్లాలో ఉన్న సువర్ణ విధాన సౌధలో నిర్వహిస్తున్నది. దీనిపై మహారాష్ట్ర అభ్యంతరం చెప్తున్నది. ఇదే రెండు రాష్ర్టాల మధ్య ఉద్రిక్తతకు దారి తీస్తున్నది. ఇప్పుడు తాజాగా, బెళగావిలో అడుగుపెడతామని మహారాష్ట్ర మంత్రులు ప్రకటించటంతో వివాదం మరింత ముదిరింది.
అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు: