బెంగళూరు, ఏప్రిల్ 10: లోక్సభ ఎన్నికల ముంగిట కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. అక్రమాస్తుల కేసులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్కు లోకాయుక్త నోటీసులు జారీచేసింది. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశించింది.
డీకే అక్రమాస్తుల కేసును మునుపటి బీజేపీ సర్కారు సీబీఐకి అప్పగించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించిన విషయం తెలిసిందే. అనంతరం కేసు లోకాయుక్తకు బదిలీ అయ్యింది. కేసు విచారణ సందర్భంగా సీబీఐకి సమర్పించిన పత్రాలను తమకు కూడా అందజేయాలని తాజాగా డీకేకు పంపిన నోటీసుల్లో లోకాయుక్త కోరింది. ఆదాయానికి మించి రూ.74.93 కోట్లు అక్రమాస్తులు కూడబెట్టారని డీకే శివకుమార్పై ఆరోపణలు ఉన్నాయి.