బెంగళూరు, డిసెంబర్ 27: వ్యాపార సంస్థల నామఫలకాల్లో 60 శాతం కన్నడలోనే ఉండాలని కర్ణాటక సర్కారు ఆదేశాలు ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. కర్ణాటక రక్షణ వేదిక(కేఆర్వీ) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది. ఇందులో భాగంగా బెంగళూరులో పలు చోట్ల ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, కార్యాలయాలపై ఇంగ్లిష్లో ఉన్న నేమ్ ప్లేట్స్ను ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, లావెల్లే రోడ్, యూబీ సిటీ, చామరాజపేట, చిక్పేట, కెంపెగౌడ రోడ్, గాంధీనగర్, సెయింట్ మార్క్స్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఇంగ్లిష్ పేర్లు ఉన్న చోట నల్ల రంగు చల్లారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.