బెంగళూరు, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది. 224 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీకి బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు 13న విడుదల అవుతాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థులు, నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. కాగా, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 29 నుంచి రూ.147 కోట్ల మేర నగదుతో పాటు రూ.228 కోట్ల విలువైన మద్యం, బంగారం, ఇతర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.