బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 66 శాతం పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పలు బూత్లలో ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. దాంతో క్యూ లైన్లలో ఉన్నవారి వరకు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరినీ లైన్లలోకి రానీయలేదు.
కాగా, పోలింగ్ సమయం ముగిసిన క్యూలైన్లలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. అయితే ఆ పెరిగే పోలింగ్ శాతం ఎంత ఉంటుందనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్నది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో 72.13 శాతం పోలింగ్ నమోదైంది. ఇవాళ కూడా అంత శాతం పోలింగ్ నమోదవుతుందా లేదా..? అనే విషయంలో మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది.
65.69% voter turnout recorded till 5 pm, in #KarnatakaElections pic.twitter.com/PH6R2LYtAP
— ANI (@ANI) May 10, 2023