న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: కర్ణాటకలో కమీషన్ రాజ్పై రాజకీయ దుమారం మరింత ముదిరింది. బీజేపీ ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, అధికారులు ఏ కాంట్రాక్టు ఇవ్వాలన్నా 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారంటూ జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, బెంగళూరులో తాజాగా పోస్టర్ల కలకలం రేగింది. ప్రముఖ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ ‘పేటీఎం’తో సీఎం బసవరాజ్ బొమ్మైని పోలుస్తూ ‘పేసీఎం’ అంటూ, క్యూఆర్ కోడ్ ముద్రించిన పోస్టర్లు వెలిశాయి.
‘ఇక్కడ 40 కమీషన్ స్వీకరించబడును’ అని సందేశం రాశారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కాంగ్రెస్ ప్రారంభించిన ‘40 పర్సెంట్ సర్కారా’ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నదని అధికారులు తెలిపారు. పేసీఎం పోస్టర్లపై బొమ్మై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పోస్టర్ల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలని దర్యాప్తునకు ఆదేశించారు.