హైదరాబాద్ : మరో ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కరోనా బారిన పడగా, ఆ జాబితాలో మరో సీఎం చేరారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి కరోనా సోకింది. ఈ మేరకు సీఎం బసవరాజు బొమ్మై అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా వేదికగా ప్రకటించారు.
తాను కరోనా పాజిటివ్గా పరీక్షించబడ్డానని బసవరాజు తన ట్వీట్లో పేర్కొన్నారు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉన్నానని తెలిపారు. ఇటీవల, ఇవాళ తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోని, హోం ఐసోలేషన్లో ఉండాలని సీఎం బసవరాజు బొమ్మై విజ్ఞప్తి చేశారు.
I have tested positive for COVID -19 today with mild symptoms. My health is fine, I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested.
— Basavaraj S Bommai (@BSBommai) January 10, 2022