బెళగావి: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. ఆలయాల భూముల్లో అక్రమంగా నిర్మించిన మసీదులను ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆదివారం బెళగావిలో మాట్లాడుతూ.. ‘మసీదులు నిర్మించిన మరో రెండు స్థలాలపై దృష్టి సారించాం. అందులో మథుర ఒకటి.
కోర్టు నిర్ణయం రాగానే అక్కడ ఆలయ నిర్మాణం కొనసాగిస్తాం’ అని ఆయన అన్నారు. ‘అలాంటి ప్రదేశాల్లోని మసీదులను ముస్లింలు ఇష్టపూర్వకంగా వదిలేస్తే మంచిది. లేకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు.