మైసూరు: కర్నాటకలోని మైసూరులో దసరా వేడుకలు అంగరంగ వైభవం జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఈసారి కూడా దసరా సంబరాలకు ఆ నగరం ముస్తామవుతున్నది. మైసూరు ఉత్సవాలను నాడా హబ్బగా పిలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ పండుగను నిర్వహిస్తుంది. మైసూరులో ఎనిమిది ఏనుగులతో ఉత్సవాలను చేపడుతారు. వాటిని సుందరంగా అలంకరిస్తారు. అయితే మైసూరు ప్యాలెస్కు ఏనుగులకు పూర్ణకుంభంతో స్వాగతం తెలిపారు. ఆ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.