Shivamogga | కర్ణాటకలోని శివమొగ్గలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బ్యానర్పై బీజేపీ ప్రముఖుల్లో ఒకరిగా భావిస్తున్న వినాయక్ దామోదర్ సావర్కర్ ఫొటో ప్రచురించారు. ఈ బ్యానర్ను మరో వర్గం తొలగించి టిప్పు సుల్తాన్ ఫొటో ప్రచురించిన పోస్టర్తో రీప్లేస్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తికి కత్తి పోట్లు తగిలాయి.
ఈ సమాచారం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని సదరు టిప్పు సుల్తాన్ పోస్టర్ తొలగించారు. అక్కడ గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు పరిస్థితులను నియంత్రణలోకి తేవడానికి ప్రయత్నించారు. టిప్పు సుల్తాన్ పోస్టర్ వేసిన ప్రాంతంలో అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఇరు పక్షాల వారు గుమికూడకుండా నిషేధాజ్ఞలు పోలీసు అధికారులు విధించారు. శాంతిభద్రతలు అదుపులోకి తేవడానికి అదనపు బలగాలను మోహరించారు. శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు. ఉద్రిక్తతలు చెలరేగితే లాఠీచార్జీ చేశామని పోలీసు అధికారులు చెప్పారు. ఈ అంశంపైనే సదరు వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యారా? అన్న సంగతి పరిశీలిస్తున్నట్లు తెలిపారు.