బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఉప సభాపతి ఆనంద్ మమణి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం శనివారం అర్ధరాత్రి దాటినతర్వాత తుదిశ్వాస విడిచారు.
56 ఏండ్ల మమణి.. సవదట్టి నియోజకవర్గం నుంచి మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన లివర్ ఇన్ఫెక్షన్కు గురైంది. దీంతో బెంగళూరులోని మణిపాల్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన కోమాలో వెళ్లడంతో మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని చెన్నైకి తరలించారు. అటునుంచి మళ్లీ బెంగళూరుకు తీసుకొచ్చారు.