న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో మత ఘర్షణలు జరగలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. కేంద్రం, పలు రాష్ర్టాల్లో బీజేపీ పాలనలో చోటుచేసుకున్న ఘర్షణలను ఉదహరించారు. షా వ్యాఖ్యలు.. మరో జుమ్లా అంటూ వ్యాఖ్యానించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న 2014-2020 మధ్య ఎన్సీఆర్బీ డాటా ప్రకారం 5,415 మత ఘర్షణలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఇందులో 2019లోనే 25 జరుగగా, అందులో యూపీలో 9, మహారాష్ట్రలో 4, ఎంపీలో 2 నమోదయ్యాయన్నారు.