తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సీనియర్ నేత, కన్నూర్ ఎంపీ కే సుధాకరన్ ను అధిష్టానం నియమించింది. కేపీసీసీ చీఫ్ గా సుధాకరన్ ను నియమించిన కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ కేరళ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కే సురేష్, పీటీ థామస్, టీ సిద్దిఖీలను నియమించింది.
కేరళలో సీనియర్ నేతలందరినీ కలుపుకుపోయి పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తానని కే సుధాకరన్ తన నియామకంపై స్పందించారు. పార్టీ తనకు కీలక పదవిని అప్పగించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీని పునరుద్ధరించి పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమై తిరిగి పటిష్ట శక్తిగా ముందుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు.