బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. కన్నడ రక్షా వేదిక చేపట్టిన నిరసన విధ్వంసానికి దారి తీసింది. సైన్ బోర్డులపై స్థానిక కన్నడ భాష(Kannada Language)ను వాడాలని డిమాండ్ చేస్తూ బెంగుళూరులోని ఓ హోటల్ పై ఇవాళ దాడి చేశారు. బెంగుళూరు మున్సిపాలిటీ బీబీఎంపీ ఇచ్చిన తాజా ఆదేశాలు ఆందోళనకు ఊపిరి పోశాయి.
నగరంలోని వాణిజ్య కూడళ్లు.. తమ సైన్ బోర్డులను 60 శాతం కన్నడ భాషల్లో ఉంచాలని బీబీఎంపీ ఆదేశించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోగా బోర్డులను కన్నడ భాషలో పెట్టాలని, లేదంటే ఆయా వాణిజ్య కేంద్రాలు తమ వాణిజ్య లైసెన్స్ను కోల్పోనున్నట్లు చెప్పాయి.
అయితే మున్సిపాల్టీ ఇచ్చిన ఆదేశాల గురించి తమకు అవగాహన లేదని, అందుకే ఆ నిబంధనలు పాటించలేకపోయినట్లు వాణిజ్య సంఘాలు తెలిపాయి.
#WATCH | Bengaluru: Kannada Raksha Vedhike holds a protest demanding all businesses and enterprises in Karnataka to put nameplates in Kannada. pic.twitter.com/ZMX5s9iJd0
— ANI (@ANI) December 27, 2023