న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కంఝావాలా ఏరియాలో అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురు అరెస్టు కాగా, తాజాగా అంకుశ్ అనే మరో నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న అంకుశ్ అనే నిందితుడు.. ఇవాళ సాయంత్రం సుల్తాన్పురి పోలీస్స్టేషన్లో సరెండర్ అయ్యాడు.
దాంతో పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంకుశ్తో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య ఏడుకు చేరింది. ఇవాళ ఉదయమే అశుతోష్ అనే మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు విజ్ఞప్తి మేరకు కోర్టు అతనికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
కాగా, జనవరి 1న అర్ధరాత్రి 1.45 గంటలకు అంజలి అనే యువతి తన స్నేహితురాలు నిధితో కలిసి స్కూటీపై వెళ్తుండగా స్పీడ్గా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నింది పక్కకు పడిపోగా.. అంజలి కారు కింద ఇరుక్కుపోయింది. అయినా నిందితులు కారును ఆపకుండా ఆమెను అలాగే 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అంజలి ప్రాణాలు విడిచింది.
Delhi | Seventh accused in the Kanjhawala death case, Ankush surrenders before Police. Visuals from Sultanpuri Police Station. pic.twitter.com/FppccoiQ1N
— ANI (@ANI) January 6, 2023
#UPDATE | Kanjhawala death case | Delhi’s Rohini Court sends sixth accused, Ashutosh to 3-day Police custody.
Visuals of him being brought out of Delhi’s Rohini Court. pic.twitter.com/aZMLNOXkvU
— ANI (@ANI) January 6, 2023