న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు.. ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కంగనాకు ఆ నోటీసులు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ చద్దా ప్యానెల్ ముందు డిసెంబర్ ఆరో తేదీన హాజరుకావాలంటూ ఆదేశించారు. సిక్కులను కించపరిచే రీతిలో కంగనౌ కామెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా సిక్కులపై అనుచిత రీతిలో వ్యాఖ్యలు చేసిన కంగనాపై ముంబైలోనూ కేసును నమోదు చేశారు. ఏడాది కాలంగా రైతులు చేస్తున్న ధర్నాలు ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణిస్తూ కంగనా ఆరోపణలు చేసింది. అయితే ఆమె కావాలనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. సిక్కులను అణిచివేసింది ఒక్క ఇందిరా గాంధీ మాత్రమే అని, మాజీ ప్రధాని ఇందిర దేశ విభజన చేయకుండా సిక్కులను అడ్డుకున్నట్లు కంగనా తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపింది. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రైతుల తీరును కంగనా తప్పుపట్టారు.