భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్ సవాల్ విసిరారు. ఇటీవలి కాలంలో శివరాజ్ పలుమార్లు తన ఆరోగ్యం గురించి మాట్లాడిన విషయాన్ని కమల్ నాథ్ ప్రస్తావించారు. ’కమల్నాథ్ అనారోగ్యంతో ఉన్నారు. ఆయన వయసైపోయింది. ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు‘ ఇలా శివరాజ్ సింగ్ అంటున్నట్లు కమల్నాథ్ చెప్పారు. ఇవన్నీ పక్కనపెట్టి తనతో పరుగు పందెంలో పాల్గొంటే ఎవరు ఫిట్గా ఉందీ తెలిసిపోతుందని కమల్నాథ్ సవాలు విసిరారు.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత తనకు న్యూమోనియా వచ్చిందని, దాని చికిత్స కోసమే ఢిల్లీ వెళ్లానని కమల్నాథ్ వెల్లడించారు. కొవిడ్ రెండు రకాలుగా ఉంటుందని, ఒకటి షార్ట్టర్మ్ రెండోది లాంగ్టర్మ్ అని వివరించారు. తనకు లాంగ్టర్మ్ కొవిడ్ వచ్చిందని, అందుకే చికిత్స తీసుకున్నానని అన్నారు. మాట్లాడితే తన ఫిట్నెస్పై మాట్లాడుతున్న శివరాజ్ తనతో రేస్లో పాల్గొనాలంటూ ఛాలెంజ్ విసిరారు.
మధ్యప్రదేశ్లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో కమల్నాథ్ బిజీగా ఉన్నారు. ఆశావహంగా ఉన్న అభ్యర్థుల పేర్లను తీసుకొని మళ్లీ కొన్నిరోజుల్లో ఢిల్లీ బయలుదేరతారని సమాచారం.