భోపాల్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ జలక్ తగలనున్నది. ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్నాథ్(Nakul Nath).. బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి చేసిన ఓ పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో కమల్నాథ్కు మీడియా అడ్వైజర్గా చేసిన నరేంద్ర సలూజా.. ఎక్స్ అకౌంట్లో కమల్నాథ్, నకుల్నాథ్ ఫోటోను పోస్టు చేశాడు. దానికి జై శ్రీరామ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. మరో వైపు నకుల్నాథ్ తన ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ నుంచి కాంగ్రెస్ పదాన్ని తీసేశారు. ప్రస్తుతం ఆయన చింద్వారా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు.