చెన్నై, మార్చి 9: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ‘మక్కల్ నీది మైయమ్’ (ఎంఎన్ఎం) పోటీ చేయటం లేదని ఆ పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తాజాగా ప్రకటించారు. అయితే తమిళనాడులో తమ మిత్ర పక్షమైన అధికార ‘డీఎంకే’కు తాము మద్దతు తెలుపుతున్నామని, డీఎంకే అభ్యర్థుల తరఫున తమ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తాయని ఎంఎన్ఎం ప్రధాన కార్యదర్శి అరుణాచలం తెలిపారు.
శనివారం డీఎంకేతో కమల్హాసన్ సమావేశం అనంతరం ప్రకటన విడుదల చేశారు. డీఎంకేకు మద్దతు ఇచ్చినందుకు, ఒక రాజ్యసభ స్థానం ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చిందని వెల్లడించారు.