న్యూఢిల్లీ : రాబోయే ఐదేండ్లలో దుబాయ్ తరహాలో భారత్ గ్లోబల్ ఏవియేషన్ హబ్గా అవతరిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్లో విమానయాన రంగం వృద్ధిపధాన పయనించడం ఆరంభమైందని చెప్పారు. ఈ సంవత్సరాంతానికి ఢిల్లీ విమానాశ్రయం ప్రపంచంలో రెండో అతిపెద్ద విమానాశ్రయంగా ఎదుగుతుందని పేర్కొన్నారు.
దేశంలో పౌరవిమానయాన మౌలిక వసతులు శరవేగంగా విస్తరిస్తున్నాయని అన్నారు. ఢిల్లీ విమానాశ్రయం సామర్ధ్యం డిసెంబర్ నాటికి 11 కోట్ల ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేర్చేలా ఎదుగుతుందని తెలిపారు. అప్పటికి అట్లాంటా తర్వాత ప్రపంచంలోనే ఢిల్లీ రెండో అతిపెద్ద విమానాశ్రయంగా అవతరిస్తుందని అన్నారు.
రాబోయే 12 నెలల్లో జెవార్ విమానాశ్రయం ప్రారంభమవుతుందని 2030 నాటికి ఆ విమానాశ్రయ సామర్ధ్యం 6 కోట్లకు పెరుగుతుందని మంత్రి వెల్లడించారు. జెవార్, ఢిల్లీ విమానాశ్రయాలను కలుపుకుంటే ఈ రెండు ఎయిర్పోర్ట్లు ఏటా ఏకంగా 16 కోట్ల మంది ప్రయాణీకులను హ్యాండిల్ చేస్తాయని తెలిపారు.
Read More :