గ్వాలియర్, డిసెంబర్ 28: మధ్యప్రదేశ్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. గ్వాలియర్లోని వీరనారి రాణీ లక్ష్మీబాయి స్మారకాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సందర్శించి నివాళులర్పించారు. సింధియా వంశానికి చెందిన వ్యక్తి లక్ష్మీబాయి స్మారకాన్ని సందర్శించడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత కేకే మిశ్రా మాట్లాడుతూ 1857లో బ్రిటీషర్లపై తిరుగుబాటు సమయంలో లక్ష్మీబాయికి గ్వాలియర్ రాజకుటుంబంగా ఉన్న సింధియాలు మద్దతివ్వలేదన్న విషయం అందరికీ తెలుసన్నారు.