న్యూఢిల్లీ, అక్టోబర్ 17: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం సీజేఐగా బాధ్యతలు నిర్వరిస్తున్న జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. తర్వాతి రోజు నవంబర్ 9న జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా రెండేండ్లు కొనసాగనున్నారు.