న్యూఢిల్లీ, జూలై 22: అనూహ్య మొత్తంలో భరణాన్ని కోరుతున్న భార్యపై ఒక హైప్రొఫైల్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ మందలించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 18 నెలల క్రితం వివాహమైన ఒక మహిళ భర్త నుంచి విడాకులకు రూ.18 కోట్ల భరణం, ఒక ఇల్లు, ఒక బీఎండబ్ల్యూ కారును కోరడంతో దానిపై బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు సవాల్ చేస్తూ భర్త దాఖలు చేసిన కేసును మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది.
భార్య తీరును తప్పబట్టింది. ‘నీవు బాగా చదువుకున్నావు. అలాంటివి నీవు అడగకూడదు. అంతగా కావాలనుకుంటే సొంతంగా సంపాదించి అనుభవించు. అంతేగాని అలాంటి డిమాండ్లు చేయడానికి ఇది మార్గం కాదు’ అని సీజేఐ పేర్కొన్నారు. కాగా, 18 నెలల క్రితం వివాహమైన జంటకు విడాకుల సందర్భంగా భరణం నిర్ధారణకు సంబంధించి భార్య అసాధారణ డిమాండ్లు చేయడంతో కేసు సర్వోన్నత న్యాయస్థానానికి వచ్చింది.