(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టులు భర్తీ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ అభ్యర్థులు యోగి సర్కార్ను హెచ్చరించారు. గత 6 నెలలుగా లక్నోలోని ఎకో పార్కులో చేస్తున్న ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. 13న భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించారు. 2016లో తొలుత 385 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి, 2018లో 1477 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు 2022లో పరీక్షలు రాశారు.
అప్పటినించి వాటి ఫలితాల్ని యూపీ సర్కార్ విడుదల చేయటం లేదు. మహిళా అభ్యర్థి రింకూ వర్మ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులున్నా, పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పరీక్ష రాశానని చెప్పారు. మరో మహిళా అభ్యర్ధి నిధి సింగ్ మాట్లాడుతూ, పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తూ, పెండ్లి సైతం వాయిదా వేసుకున్నానని చెప్పారు.