న్యూఢిల్లీ: రక్షణ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నారన్న ఆరోపణపై ఫ్రీలాన్స్ జర్నలిస్టు వివేక్ రఘువన్షీ, మాజీ నేవీ కమాండర్ ఆశిష్ పాఠక్లను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఇద్దరికీ ఆరు రోజులు కస్టడీ విధించింది. రక్షణ శాఖ సమాచారాన్ని విదేశీ నిఘా ఏజెన్సీలకు అందజేసినందుకు రఘువన్షీ, అతడి బంధువులు రూ.3 కోట్లు ముడు పులు అందుకున్నారని సీబీఐ అధికారులు చెబుతున్నారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.