JoSAA | దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఇంజినీరింగ్ సంస్థల్లో బీటెక్, బీఎస్సీ, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లకు ‘జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) తొలి విడుత సీట్లు కేటాయింపు ప్రారంభమైంది. జూలై నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఫస్ట్ రౌండ్ సీట్ల కేటాయింపు పక్రియ కొనసాగుతుంది.
తొలి రౌండ్లో సీట్లు పొందిన వారు గడువులోగా ఫీజు చెల్లించాలని ఐఐటీ గువాహటి తెలిపింది. జూలై ఆరో తేదీ నుంచి రెండో విడుత సీట్ల కేటాయింపు మొదలవుతుంది. ఆరు రౌండ్లలో ఈ కళాశాలల్లో సీట్ల అలాట్ మెంట్ పూర్తి చేస్తారు. విద్యార్థులు తమ సీట్ల కేటాయింపు పూర్తి వివరాలు www.josaa.nic.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ మీద క్లిక్ చేసి విద్యార్థులు తమ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నంబర్, పాస్ వర్డ్, సెక్యూరిటీ పిన్ నమోదు చేస్తే సీట్ల కేటాయింపు డిటైల్స్ తెలుసుకోవచ్చు.