న్యూఢిల్లీ: తాము తయారు చేసే ఉత్పత్తులు ఎంతో సురక్షితమైనవని, కొందరు ఆరోపిస్తున్నట్టుగా అందు లో ఆస్బెస్టాస్ పదార్థాన్ని వాడటం లేదని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ స్పష్టం చేసింది. తాము ఉత్పత్తి చేసే టాల్కమ్ ఆధారిత, ఇతర వస్తువులు వాడితే క్యాన్సర్ వస్తుందని చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ మేరకు గత వారం అమెరికాలోని న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో ముగ్గురు పరిశోధక డాక్టర్లపై వ్యాజ్యం దాఖలు చేసింది. వారు తాము చేసిన పరిశోధనలన్నీ అవాస్తవమని, ఎలాంటి ప్రాతిపాదిక లేకుండా తమపై ఆరోపణలు చేశారని పేర్కొంది.