న్యూఢిల్లీ: కొత్తగా ఇప్పుడు జేఎన్.1 కోవిడ్ వేరియంట్(JN.1 Variant) విస్తరిస్తోంది. కేరళలోని 78 ఏళ్ల మహిళలో ఆ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. చాలా వేగంగా ఆ వేరియంట్ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇమ్యూనిటీకి కూడా అది చిక్కదని అంటున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.1.86 లేదా పిరోలా వేరియంట్కు.. జేఎన్.1 వేరియంట్ను డిసెండెంట్గా భావిస్తున్నారు. 2023 సెప్టెంబర్లో తొలిసారి దీన్ని అమెరికాలో గుర్తించారు. ఈ సబ్ వేరియంట్కు చెందిన 15 కేసుల్ని చైనాలో కూడా పసికట్టారు.
పిరోలా అనే వేరియంట్ దాదాపు 38 దేశాల్లో వ్యాప్తి చెందింది. దాంట్లో ఇండియా కూడా ఉంది. ఇటీవల దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి ఈ వేరియంట్ కారణమని తెలుస్తోంది. సీడీసీ ప్రకారం బీఏ.2.86 వేరియంట్కు 20 మ్యుటేషన్లు ఉన్నట్లు గుర్తించారు. స్పైక్ ప్రోటీన్ల స్టడీ ఆధారంగా ఆ విషయాన్ని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వ్యాపిస్తున్న జేఎన్.1.. బీఏ.2.8 వేరియంట్లలో ఉన్న స్పైక్ ప్రోటీన్లలో కేవలం ఒక్క మార్పు మాత్రమే ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జేఎన్.1 వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి అవుతుందని, అది ఇమ్యూనిటీని కూడా తప్పించుకోగలదని నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో చైర్మెన్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. జేఎన్.1 వేరియంట్ వల్ల ఊపిరితిత్తుల పైభాగంలో ఇన్ఫెక్షన్ అవుతుందని ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రి డాక్టర్ ఉజ్వల్ ప్రకాశ్ తెలిపారు. జేఎన్.1 లక్షాల్లో స్వల్ప జ్వరం వస్తుందన్నారు. దగ్గు, ముక్కు దిబ్బడ,గొంతు నొప్పి, ముక్క కారడం, ముఖం అంతా నొప్పి, తల నొప్పి, కడుపు సమస్యలు తలెత్తనున్నాయి. జేఎన్.1 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
జేఎన్.1 గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు.