శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్ నౌహట్టా ప్రాంతంలో ఖ్వాజాబజార్లో శుక్రవారం ఉగ్రవాదులు బలగాలపైకి గ్రెనేడ్ విసిరారు. గ్రెనేడ్ల ధాటికి రెండు దుకాణాలు ధ్వంసమైనట్లు సమాచారం. అయితే, భద్రతా బలగాలతో పాటు సామాన్య పౌరులకు సైతం ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇంతకు ముందు ఈ నెల 11న ఉత్తర కశ్మీర్లోని బందిపోరా జిల్లాలోని నిషాత్ పార్క్లోనూ ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి గ్రెనేడ్ విసరడంతో నలుగురు పోలీసులు గాయపడగా.. ఒకరు వీరమరణం పొందారు.
J&K | Terrorists hurled a grenade on security forces at Khwaja Bazar Nowhatta area of Srinagar. Two shops were damaged in the incident. No injury reported pic.twitter.com/A4iF81puzf
— ANI (@ANI) February 18, 2022