శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పూంచ్లో ముగ్గురు పౌరుల అనుమానాస్పద మృతిపై ఆర్మీ దర్యాప్తు చేస్తున్నది. బ్రిగేడియర్ స్థాయి అధికారిని విచారణ చేస్తున్నట్టు సైనిక వర్గాలు సోమవారం వెల్లడించాయి. అధికారి బాధ్యత ఉన్న ఏరియాలో ఉగ్రవాదుల దాడుల్లో జవాన్ల మరణాల ఘటనలు పునరావృతం అవుతుండటంపై కూడా దృష్టి పెడుతున్నట్టు తెలిపాయి. గత గురువారం పూంచ్ జిల్లాలో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడిలో నలుగురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఎన్కౌంటర్ సమీపంలో ముగ్గురు పౌరులు అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారింది. కస్టడీ హింస కారణంగానే వాళ్లు మరణించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.