Jio Outage | ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు మంగళవారం నిలిచిపోయాయి. వినియోగదారులు కాలింగ్, మెసేజింగ్ వరకు పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచే సేవలను నిలిచిపోయాయని పలువురు యూజర్లు తెలిపారు. ఈ విషయంపై పలువురు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. చాలా మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఉపయోగించగలిగినా ఫోన్కాల్స్ చేయలేకపోయినట్లు తెలిపారు. గతంలోనూ జియో సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు దాదాపు మూడు గంటల పాటు ప్రభావితమయ్యాయి.
#Jiodown
Meanwhile VI and Airtel users: pic.twitter.com/EAS2uHFUXo— Soham Naskar (@SohamNaskar) November 29, 2022
మొబైల్ డేటా సర్వీసెస్ను మాత్రం వినియోగించుకోగలిగారు. జియో సర్వీసులు నిలిచిపోవడంపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్గా మారాయి. మరోవైపు, ఓ యూజన్ తన మొబైల్లో ఉదయం నుంచి VoLTE సిగ్నల్ కనిపించడం లేదని, ఫోన్కాల్స్ చేయలేకపోయినట్లు ట్వీట్ చేశాడు. సాధారణ కాల్స్లో సమస్యలు ఉన్నప్పుడు 5జీ సేవలు ఎలా అందిస్తారని కంపెనీని ప్రశ్నించాడు. ప్రస్తుతం ట్విట్టర్లో #Jiodown ట్రెండ్ అవుతున్నది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే తన ఫ్లైట్ మిస్సయిందని ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రశ్నించాడు. అయితే, ఇప్పటి వరకు సర్వీసులు నిలిచిపోవడంపై కంపెనీ స్పందించలేదు.
#Jiodown situation when you have jio fiber , jio sim and jio mobile. And the network is down. pic.twitter.com/kI6vagk9SP
— AnishKumar Agarwal (@AnIsH_261290) November 29, 2022