పాట్నా, జూన్ 20: అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలపై బీహార్లో సంకీర్ణ పక్షాలైన బీజేపీ, జేడీయూ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. తమ నేతల ఇండ్లపై దాడులను అడ్డుకోవడంలో నితీశ్కుమార్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించగా, జేడీయూ అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చింది. భవిష్యత్తుపై యువత ఆందోళనలను కేంద్రం వినాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది. కొత్త సైనిక రిక్రూట్మెంట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని సూచించింది.
తాజాగా బీజేపీ నేత, వివాదాస్పద ఎమ్మెల్యే హరీశ్భూషణ్ ఠాకూర్ బచాల్ మరో అడుగు ముందుకేసి.. బీహార్లో అగ్నిపథ్ ఆందోళనలు, హింసాకాండ వెనుక ప్రధాని మోదీని వ్యతిరేకిస్తున్న జిహాదీల హస్తం ఉన్నదని ఆరోపించారు.