మేహ్సణా, మే 5: ఐదేండ్ల క్రితం అనుమతి లేకుండా నిర్వహించిన ఓ ర్యాలీ కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని స్థానిక మెజిస్టీరియల్ కోర్టు దోషిగా తేల్చింది. మేవానీతో పాటు ర్యాలీలో పాల్గొన్న మరో తొమ్మిది మందిని కూడా కోర్టు దోషులుగా పేర్కొన్నది. వీరందరికీ మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించింది. దోషుల్లో ఎన్సీపీకి చెందిన రేష్మా పటేల్ కూడా ఉన్నారు. 2017 జూలైలో మేవానీ ‘ఆజాదీ మార్చ్’ నిర్వహించారు. దీనికి అనుమతి లేదంటూ 12 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఒకరు చనిపోయారు. మరొకరు పరారీలో ఉన్నారు. మిగిలిన పది మందిని కోర్టు దోషులుగా తేల్చింది.