న్యూఢిల్లీ: ఝార్ఖండ్ ప్రభుత్వానికి చెందిన స్టేట్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో కమిటీ సభ్యులు రాజ్భవన్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఇటీవల ఝార్ఖండ్ అసెంబ్లీ ఆమోదించిన మూడు బిల్లులను ప్రభుత్వం గవర్నర్కు పంపింది. ఈ బిల్లులను గవర్నర్ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.
అయితే ఏమైనా సవరణలు చేయాలా.. అన్న విషయాన్ని గవర్నర్ వెల్లడించలేదు. దీంతో అభ్యంతరాలను తెలుసుకోవడానికి కమిటీ స్టేట్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ఆయన నిరాకరించడంతో రాజ్భవన్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు వినతిపత్రాన్ని అందజేశారు. త్వరగా అభ్యంతరాలు తెలియజేయాలని వినతిపత్రంలో కోరారు.