Supriya Sule | మహారాష్ట్రలోని బారామతి లోక్సభా స్థానం నుంచి విపక్ష మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) కూటమి తరఫున నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరద్ పవార్) పార్టీ అభ్యర్థిగా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె నామినేషన్ పత్రాలతోపాటు తన ఆస్తుల వివరాలతో అఫిడవిట్ కూడా సమర్పించారు. ఆమె మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.48 కోట్లు. అందులో చిరాస్థులు రూ.9 కోట్లు. అఫిడవిట్ ప్రకారం సుప్రియా సూలే పేరు మీద కారు కూడా లేదు.
కానీ సుప్రియా సూలే బంగారం, వెండి, వజ్రాభరణాల విలువ రూ.2.50 కోట్ల పైమాటే. బ్యాంకులోనూ రూ.కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇక స్టాక్ మార్కెట్లో ఆమెకు ఉన్న వివిధ సంస్థల షేర్ల విలువ సుమారు రూ.3.5 కోట్లు. ఆస్తులు, బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నా, అప్పులు కూడా తీసుకున్నారు. పార్థా పవార్, సునేత్ర పవార్ నుంచి అప్పులు తీసుకున్నట్లు సుప్రియా సూలే పేర్కొన్నారు. సునేత్ర పవార్ (ప్రస్తుత ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి) నుంచి రూ.35 లక్షలు, పార్థా పవార్ నుంచి రూ.20 లక్షల రుణాలు తీసుకున్నారు.
బ్యాంకు డిపాజిట్లు : రూ.11.83 కోట్లు
షేర్లు : 16.44 కోట్లు
రుణాలు ఇచ్చినవి : రూ.3.50 కోట్లు
బంగారం : 1.927 కిలోలు (సుమారు రూ.కోటి)
వెండి : 6.742 కిలోలు (రూ.4.53 లక్షలు)
వజ్రాభరణాలు: 793 క్యారట్లు (రూ.1.56 కోట్లు)
వ్యవసాయ భూమి : రూ.5.45 కోట్లు
వ్యవసాయేతర భూమి: రూ.1.74 కోట్లు
నివాస భవనం: రూ.1.95 కోట్లు
పార్థా పవార్ రుణం: రూ.20 లక్షలు
సునేత్ర పవార్ రుణం : రూ.35 లక్షలు