హైదరాబాద్ : జేఈఈ మెయిన్ (సెషన్ -2) దరఖాస్తులకు షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. జూన్ 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 30న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జేఈఈ మెయిన్ (సెషన్ -2) ఎగ్జామ్స్ జూలై 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్ -1 ఎగ్జామ్స్ ఈ నెల 20 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఈ నెల రెండో వారం నుంచి అడ్మిట్కార్డులు జారీచేస్తారు.
జేఈఈ మెయిన్ ఫలితాల తర్వాత నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ను ఆగస్టు 28న నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం అయిదున్నర గంటల వరకు పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 7 నుంచి 11 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయొచ్చు.