IIT JEE Advanced Result | జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి గత నెల 28న పరీక్షలు నిర్వహించగా.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay) ఆదివారం విడుదల చేసింది. అభ్యర్థుల ఫలితాలు jeeadv.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, విద్యార్థులు తమ స్కోర్కార్డ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఈ పరీక్ష ఈ ఏడాది మొత్తం 1,60,038 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. ఇందులో 1,55,538 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 40,712 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఐఐటీ బాంబే జోన్కు చెందిన ఆర్కే శిశిర్ ఆల్ ఇండియా టాపర్గా నిలిచాడు. 360 మార్కులకు గాను.. శిశిర్ 314 మార్కులు సాధించాడు. అదే సమయంలో ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన తనిష్క కబ్రా మహిళల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. కబ్రా 360 మార్కులకు 277 మార్కులు సాధించింది.