KC Tyagi: వచ్చే లోక్సభ ఎన్నికల్లో (Loksabha elections) బీహార్లో భారతీయ జనతాపార్టీని (BJP) ని ఢీకొట్టడానికి జనతాదల్ యునైటెడ్ (JDU), రాష్ట్రీయ జనతాదల్ (RJD) పార్టీలు సిద్ధంగా ఉన్నాయని జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి (KC Tyagi) చెప్పారు. సీట్ల షేరింగ్ విషయంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి సమస్యలు లేవని అన్నారు.
గత లోక్సభ ఎన్నికల్లో జేడీయూ 16 లోక్సభ స్థానాల్లో విజయం సాధించిందని, ఈ ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగుతుందని త్యాగి వ్యాఖ్యానించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ INDIA కూటమి సృష్టికర్త అని, ఆ హోదా INDIA కూటమి కన్వీనర్ పదవి కంటే పెద్దదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రయోజనాల కంటే ఎక్కువగా తన సొంత ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నదని ఆయన ఆరోపించారు.